రాయదుర్గంలో ఎకరా భూమి రూ. 177 కోట్లు.. దక్కించుకున్న రియాల్టీ సంస్థ

  • నాలెడ్జ్ సిటీలో ఎకరా రూ. 177 కోట్లతో సరికొత్త రికార్డు
  • వేలంలో 7.6 ఎకరాలను దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ
  • మొత్తం రూ. 1357 కోట్లకు భూమిని చేజిక్కించుకున్న సంస్థ
హైదరాబాద్ నగరంలో భూముల వేలం సరికొత్త రికార్డు నెలకొల్పింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి ఏకంగా రూ. 177 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) వేలం వేసింది.

ఈ వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎకరాకు రూ. 177 కోట్ల చొప్పున 7.6 ఎకరాలను దక్కించుకుంది. మొత్తం రూ. 1,357 కోట్లకు ఈ భూమిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా, తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లోనూ రికార్డు ధర నమోదైంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్‌లో చదరపు గజం రూ. 1.14 లక్షలకు అమ్ముడుపోయింది.

MSN Real Estate
Hyderabad land auction
Rayadurgam
TGIIIC
Telangana Industrial Infrastructure Corporation

More Telugu News